NAVA SANGHARSHANA
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 6:51 pm Posted by : NAVA SANGHARSHANA DESK

లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహాకాళి అమ్మవారికి బోనం సమర్పించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

లాల్ దర్వాజా స్పెషల్: బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని,కొత్తగా పెట్టిన మా పార్టీకి అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చానని,తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బోనాల ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం మూడేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతి రంగంలో అమ్మవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం లేదని చెబుతున్నారు. ధ్వజస్తంభం, విగ్రహా పున ప్రతిష్ట వంటి చాలా అంశాలను అమ్మవారు ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. బోనం ఎత్తుకొని సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి దయతో వాళ్ల కుటుంబాలన్నీ బాగుండాలి. ఇవ్వాళ ఒక ఆడబిడ్డగా నేను కొత్త పార్టీ ఏర్పాటు చేసి అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చాను. మా పార్టీకి కొత్త శక్తి, ప్రజలకు సేవ చేసే సత్తువ కల్పించాలని కోరుకుంటున్నానని అన్నారు.