NAVA SANGHARSHANA
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 2:56 pm Posted by : NAVA SANGHARSHANA DESK

రూ.73 కోట్ల ధాన్యాన్ని దొంగిలించిన TRP పార్టీ వట్టె జానయ్య యాదవ్

రూ.73 కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లుల నుంచి దొంగిలించిన TRP పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా: బాలెంల పరిధిలోని వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మార్ట్‌లలో రూ.73 కోట్ల విలువైన ధాన్యాన్ని మాయం చేసిన వట్టె జానయ్య యాదవ్.రెండు మిల్లుల్లో తనిఖీలు చేసి 29,188 టన్నుల వడ్లు మాయమైనట్లు నిర్ధారించిన సూర్యాపేట విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.వజ్ర వికాస్ రైస్ మార్ట్ నుంచి FCIకి పంపాల్సిన బియ్యాన్ని ముదిగొండలోని సత్యసాయి రైస్ కార్పొరేషన్ పేరుతో అక్రమంగా తరలిస్తుండగా లారీలను నిలిపివేసి స్వాధీనం చేసుకున్న అధికారులు.మిల్లుల్లో ఉన్న నిల్వలను సీజ్ చేసి ఇతర మిల్లులకు తరలించాలని అధికారుల ఆదేశాలు.వట్టె జానయ్య యాదవ్‌తో పాటు రేణుక, గణేష్ అనే మరో ఇద్దరిపై కేసు నమోదు