NAVA SANGHARSHANA
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 8:18 pm Posted by : NAVA SANGHARSHANA DESK

ఉద్యమకారులను గుర్తించని కాంగ్రెస్ ప్రభుత్వం: కల్వకుంట్ల కవిత

బషీర్ బాగ్, ట్యాంక్బండ్ న్యూస్:ఈరోజు ఉద్యమకారులకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి నివేదికను పార్టీ నాయకులతో పాటు కలసి అమరవీరుల స్మారక చిహ్నం కార్యాలయంలో అందించడం జరిగింది. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితక్క ఆరోపించారు. ఇంకా అనేక అంశాలను ఉద్యమకారుల సిఫారస్ కమిటీకి లిఖితపూర్వకంగా అందించి వివరించడం జరిగింది. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే మరొక కార్యక్రమం తీసుకుని వారి ఆకాంక్ష అమలయ్యేంతవరకు పోరాటం విరమించేది లేదని విశ్రమించేది లేదని తెలిపారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నాయకులు వివిధ నియోజకవర్గ నాయకులతో పాటు మునుగోడు నియోజకవర్గం ఇన్చార్జి తెలంగాణ మాధవక్క గారు సమావేశంలో పాల్గొనడం జరిగింది.